వరంగల్ : సమక్క సారలమ్మను దర్శించుకోవడానికి ఉపరాష్ట్ర పతి వెంకయ్యనాయుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావులు ఈ రోజు మేడారం రానున్న సందర్భంగా మేడారం జాతర ఉత్సవ కమిటీ భారీ ఏర్పాట్లు చేసింది. వెంకయ్యనాయుడు ఉదయం 11.30 గంటలకు, కేసీఆర్ మధ్యాహ్నం 12.30 గంటలకు మేడారం రానున్నారు మేడారం జాతరకు ఉపరాష్ట్ర పతి స్థాయి ప్రముఖులు రావడం ఇదే ప్రథమం కావడంతో భద్రత పరంగా పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. ఉపరాష్ట్రపతి, ముఖ్యమంత్రి వచ్చే సమయంలో భక్తుల మెక్కుబడులను నిలిపివేయనున్నారు.