జనగామ: రఘునాథపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు - కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మేడారం వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. బాధితులు హైదరాబాద్ హఫీజ్పేట్కు చెందిన వారిగా గుర్తించారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.