-రూ. 35 వేల కోట్లతో గృహాల నిర్మాణం
-దేశంలోనే గృహ నిర్మాణ రంగంలో తెలంగాణ ఆదర్శం
-ప్రతి అర్హునికి డబుల్ బెడ్ రూం అందిస్తాం
-రాష్ట్ర ఐటి, మునిసిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు
కరీంనగర్-సూర్యప్రత్యేకప్రతినిధి : పేదవాడి ఆత్మగౌరవ ప్రతికగా డబుల్బెడ్ రూం అని రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. శుక్ర వారం రాజన్నసిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల మండ ంలోని మండేపల్లి గ్రామంలో నిర్మించనున్న డబుల్బెడ్ రూం ఇళ్ల నిర్మాణం సముదాయానికి భూమిపూజ చేశారు. అనం తరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతు రాష్ట్ర ంలో గృహాల నిర్మాణానికి రూ.35వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని తెలిపారు. దేశంలోనే గృహ నిర్మాణ రంగ ంలో తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా ఉందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం గూడులేని పేదలకు ఉచితంగా డబుల్బెడ్రూం ఇళ్లను నిర్మించి అంది స్తుందని స్పష్టం చేశారు. ఇళ్ల లబ్దిదారుల ఎంపికలో రాజకీ య జోక్యం ఉండదని తేల్చి చెప్పారు. లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను అధికారులు పూర్తి చేస్తారని అన్నారు. ఈ ఇళ్ల నిర్మాణాలకు ఇసుక ఉచితంగా సరఫరా చేస్తామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి గూడులేని నిరుపే దకు డబుల్బెడ్ రూంను తప్పకుండా అందిస్తుందని ఈ సందర్బంగా తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఇచ్చిన మాట ప్రకారం డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు కృషిచేయాలన్నారు. గతంలోని ప్రభుత్వాలు ఇచ్చిన ఇళ్లు లబ్దిదారులకు అనుకూలంగా లేవని తెలి పారు. దానిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత
ం ఇండ్లు లేని నిరుపేదలకు డబుల్బెడ్ రూం నిర్మించి ఇస్తుందన్నారు. మండేపల్లి గ్రామంలో 1260 డబుల్బెడ్ రూం ఇళ్లను నిర్మించి పేదలకు అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ప్రతి నిరుపేదకు డబుల్బెడ్ రూం ఇళ్లు తప్పక అందుతుందని అన్నారు. ఈ కార్య క్రమంలో టెబ్కాబ్ చైర్మేన్ కొండురి రవీందర్రావు, సిరిసిల్ల మున్సిపల్ చైర్మేన్ సామల పావని, కలెక్టర్ కృష్ణభాస్కర్, జడ్పిటిసి, ఎంపిపి, గ్రామ సర్పంచ్, తెరాసా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గోన్నారు.