ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్యపై వేటు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 11, 2017, 10:54 AM

హైదరాబాద్ : టీడీపీ ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్యపై వేటు పడింది. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగించిన సమయంలో వీరిద్దరూ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నందుకు రేవంత్, సండ్రను ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేసినట్లు స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించారు. బడ్జెట్ సమావేశాలు ఈ నెల 27వరకు కొనసాగనున్నాయి. ప్రస్తుతం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ కొనసాగుతున్నది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa