మేడ్చల్ : కీసరగుట్టలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాష్ర్ట రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి విఘ్నేశ్వర పూజలు చేశారు. కీసరగుట్ట స్వామి ఆలయ ప్రాంగణంలో వివిధ ప్రభుత్వ ఫథకాల స్టాల్స్ ను, బ్రహ్మోత్సవాల క్రీడలను మంత్రి ప్రారంభించారు. మహా శివరాత్రికి కీసరగుట్టతో పాటు అన్ని శైవ క్షేత్రాలలో భక్తులకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంత్రి మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. వేములవాడ, కాళేశ్వరం, కీసరగట్ట, ఏడుపాయలు, ఏకాంబరేశ్వరంతో పాటు శ్రీశైలంకు భక్తుల రవాణా కోసం 1500 ఆర్టీసీ బస్సులు నడిపిస్తున్నట్లు వెల్లడించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. శ్రీశైలంకు 800, కీసరగుట్టకు 308, వేములవాడకు 200, ఏడుపాయలకు 150 ప్రత్యేక బస్సులు నడిపిస్తామన్నారు.