నల్గొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు క్రాస్ చేస్తున్న ఓ వృద్ధురాలిని వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతురాలిని జిట్టా ఎల్లమ్మ(75)గా గుర్తించారు. మృతురాలి నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.