ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వేములవాడ ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ప్రారంభం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 12, 2018, 09:04 AM

వేములవాడ: శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో మహా శివరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. మహాశివరాత్రి పురస్కరించుకొని రాజన్న ఆలయంలో 3 రోజులు ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. రాత్రి 9 గంటలకు నిశిపూజ అనంతరం మహాశివరాత్రి పూజలు ప్రారంభమవుతాయి. ఆలయంలో ఆర్జిత సేవలను రద్ద చేసి భక్తులకు లఘు దర్శనం అమలు చేస్తున్నారు. కోడె మొక్కులను యథాతథంగా ఆలయ సిబ్బంది కొనసాగించనున్నారు. రేపు అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు సర్వదర్శనం అమలు చేస్తారు. రేపు తెల్లవారుజామున 3.30 నుంచి 4 వరకు మంగళవాద్యాలు, ఆలయ శుద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. రేపు ఉదయం 4 నుంచి 6 వరకు సుప్రభాతం, ప్రాతఃకాలపూజ నిర్వహించనున్నారు.


రేపు ఉదయం 7 గంటలకు స్వామి వారికి టీటీడీ తరుపున పట్టు వస్ర్తాలు సమర్పించనున్నారు. అనంతరం.. ఉదయం 8 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టు వస్ర్తాలు సమర్పిస్తారు. రేపు సాయంత్రం 4 గంటలకు శివదీక్ష మాలధారులను దర్శనానికి అనుమతించనున్నారు. రేపు సాయంత్రం 6 గంటలకు ఆలయంలో మహాలింగార్చన అభిషేకం జరుగుతుంది. రేపు రాత్రి 11.35 గంటలకు రుత్వికులచే మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరుగుతుంది. ఎల్లుండి వేకువజామున స్వామివారికి సుప్రభాతం, ప్రాతఃకాల పూజలు, ఆర్జితసేవలు నిర్వహిస్తారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com