నల్గొండ జిల్లాలో మరో కాంగ్రెస్ నేత హత్య చోటుచేసుకుంది.. గత కొద్దీ రోజుల క్రితం నల్గొండ జిల్లా మునిసిపల్ చైర్పర్సన్ భర్త, కోమటి రెడ్డి వెంకటరెడ్డి కుడిభుజం బొడ్డుపల్లి శ్రీనివాస్ ను కొందరు బండరాయితో కొట్టి హత్య చేశారు.. ఈ హత్య రెండు పార్టీల మధ్య సంచలనం సృష్టించింది.. టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ల మధ్య తీవ్ర ఆరోపణలు జరిగాయి.. ఈ కథ ముగియకుండానే నల్గొండలో మరో కాంగ్రెస్ నేత దారుణ హత్యకు గురైయ్యాడు.. తిరుమలగిరి మండలం, చింతలపాలెం గ్రామ ఉప సర్పంచ్, కాంగ్రెస్ నేత ధర్మానాయక్ను దుండగులు దారుణంగా హత్య చేశారు..
ఈ రోజు ఉదయం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది.. ధర్మానాయక్ నిద్రిస్తున్న సమయంలో దుండగులు ఆయన మంచం కింద బాంబు పెట్టి పేల్చారు. దీంతో ధర్మానాయక్ శరీర భాగాలు చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి.. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త నెలకొంది.. ఇప్పటికే శ్రీనివాస్ హత్య కేసులో ఇరు పార్టీల మధ్య పోరు నడుస్తుంది.. ఇప్పుడు ఈ హత్యతో ఇంకేం జరుగుతుందో అని పలువురు భావిస్తున్నారు.. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ధర్మానాయక్ హత్యకు పాత కక్షలే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..