హైదరాబాద్: సీపీఎస్ రద్దుతో పాటు ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మార్చి 22న హైదరాబాద్లో బహిరంగసభ నిర్వహించనున్నట్టు టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్రెడ్డి చెప్పారు. సోమవారం నాంపల్లిలోని కార్యాలయంలో జరిగిన టీఎన్జీవో కేంద్ర కమిటీ కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు. సీపీఎస్ రద్దు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు. ఏప్రిల్ ఐదు నుంచి ఎనిమిది వరకు మద్రాసులో నిర్వహించే ఏఐఎస్జీఈఎఫ్ సమావేశాల్లో ఉద్యోగులు అధికసంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి ఎం రాజేందర్, సహాధ్యక్షుడు ఉపేందర్రెడ్డి, మహిళా చైర్పర్సన్ రేచల్ తదితరులు పాల్గొన్నారు.