జమ్ము : జమ్మూ కాశ్మీర్ లోని సన్ జువాన్ ఉగ్రవదాడిలో అమరుడైన జవాన్ కు సైనిక లాంఛనాలతో నేడు అంత్యక్రియలు నిర్వహించారు. హవల్దార్ రాకేష్ చంద్ర ఈ ఉగ్రదాడిలో అసువులు బాసిన సంగతి తెలిసిందే. అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించి ఉగ్రదాడిని దీటుగా తిప్పికొట్టి ఆ ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ రకేష్ చంద్రకు సైనికాధికారులు నివాళులర్పించారు.