షిల్లాంగ్ : మేఘాలయ శాసనసభకు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్రంలో జరిగే రెండు ఎన్నికల సభలలో ప్రసంగించనున్నారు. శుక్రవారంనాడు 12 గంటలకు జోవాయ్లోనూ, మధ్యాహ్నం 3 గంటలు మల్కి గ్రౌండ్లోనూ జరిగే రెండు సభలలో అమిత్ షా ప్రసంగిస్తారని మేఘాలయ బిజెపి షిబున్ లింగ్డా చెప్పారు.