న్యూఢిల్లి : ముస్లింలు కూడా ఇతరుల మాదిరిగానే జాతి కోసం పాటుపడుతున్నారని కాంగ్రెస్ నాయకుడు సందీప్ దీక్షిత్ అన్నారు. అయితే హిందూ సంస్థలు వారిని దేశాన్ని ప్రేమించరని, జాతి వ్యతిరేకులని విమర్శిస్తున్నాయని ఆయన చెప్పారు. ఆర్మీలో చేరితే జాతీయ భావాలు కలిగిన వ్యక్తి అవుతారని ఆయన అన్నారు. బహుశా అందుకోసమే ఎంఐఎం అధినేత ఒవైసీ వ్యాఖ్యలు చేసి ఉంటారని ఆయన అన్నారు.