వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రముఖ టెలికాం ఆపరేటర్ ఎయిర్టెల్ తన వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్లను తీసుకొచ్చింది. రూ.93 ప్రీపెయిడ్ ప్లాన్ రీఛార్జ్తో 28 రోజుల పాటు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, ప్రతిరోజు 1జీబీ డేటా, ఉచితంగా 100 ఎస్సెమ్మెస్లను ఇస్తున్నట్లు ఎయిర్టెల్ పేర్కొంది. జియో అందిస్తున్న రూ.98 రిఛార్జ్ ఆఫర్కు పోటీగా భారతీ ఎయిర్టెల్ ఈ ప్రత్యేక ఆఫర్ ప్రవేశపెట్టింది. ఈ కొత్త బడ్జెట్ ప్లాన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పరిధిలోని కస్టమర్లకు మాత్రమే ప్రత్యేకమని సమాచారం. వినియోగదారులు సంబంధిత ఆపరేటర్ను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకొని మాత్రమే రిఛార్జ్ చేసుకోవాలి. 2017 డిసెంబర్లో రూ.93 రిఛార్జ్పై కేవలం 10 రోజుల పాటు మాత్రమే 1జీబీ డేటా, అన్లిమిటెడ్ కాల్స్ ఆఫర్ను ఎయిర్టెల్ లాంచ్ చేసింది.