హైదరాబాద్: హెచ్ఐసీసీలో అంతర్జాతీయ మైనింగ్ టుడే సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సుకు గవర్నర్ నరసింహన్, మంత్రి కేటీఆర్, కేంద్రమంత్రి తోమర్తోపాటు దేశ విదేశాల నుంచి 500మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. ఖనిజాల అన్వేషణ, తవ్వకాల్లో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, మైనింగ్ అనుబంధ రంగాల్లో ఉఉన్న అవకాశాలపై సదస్సులో చర్చించనున్నారు. నాలుగు రోజుల పాటు మైనింగ్ టుడే సదస్సు జరుగనుంది.