న్యూఢిల్లీ: రాష్ట్ర మంత్రి హరీశ్రావు కేంద్ర మంత్రి హర్షవర్దన్ను కలిశారు. ఆయన వెంట రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి, ఎంపీలు జితేందర్ రెడ్డి, బీబీ పాటిల్, ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా సీతారామ ప్రాజెక్టుకు వన్యప్రాణ సంరక్షణ అనుమతులు ఇవ్వాలని కోరారు. పాలమూరు ఎత్తిపోతలకు తొలిదశ అటవీ అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కాళేశ్వరానికి పర్యావరణ అనుమతులు ఇచ్చినందుకు హర్షవర్దన్కు మంత్రి హరీశ్రావు ధన్యవాదాలు తెలియజేశారు.