జొహన్నెస్బర్గ్: టీం ఇండియా క్రికెటర్లపై దక్షిణాఫ్రికా మాజీ ఆల్రౌండర్ షాన్ పొలాక్ సంచలన కామెంట్స్ చేశారు. భారత ఆటగాళ్లు వన్డే మ్యాచ్ల కన్నా టెస్ట్ మ్యాచ్లకు ప్రాధాన్యం ఇస్తే బాగుటుందని సూచించారు. టెస్టు మ్యాచ్ల్లో భారత్ తీరుపై పొలాక్ మండిపడ్డారు. టెస్టు సిరీస్కు భారత్ సరైన ప్రాధాన్యత ఇవ్వకుండా బరిలోకి దిగడం తనను నిరాశకు గురిచేసిందని పొలాక్ విమర్శించారు. టెస్టు సిరీస్ కోసం టీం ఇండియాకు ప్రాక్టీస్ చేయడానికి ఎక్కువ సమయం కేటాయిస్తే బాగుండేదని పొలాక్ అన్నారు. టీంలో ఆత్మవిశ్వాసం నింపేందుకు భారత కెప్టెన్ కోహ్లీ ప్రయత్నిస్తున్నాడని పొలాక్ వెల్లడించారు.