మేడ్చల్ : జిల్లా విద్యాశాఖలో అక్రమాల డొంక కదులుతుంది. ప్రభుత్వ గుర్తింపు పొందేందుకు ప్రైయివేట్ పాఠశాలలు అనుమతుల కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. బోగస్ పత్రాలు సమర్పించి అనుమతి పొందుతున్నారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో జిల్లాలోని ప్రైయివేట్ పాఠశాలల యాజమాన్యుల గుండెల్లో గుబులు మొదలైంది. ఇప్పటికే హిమాయత్నగర్ మండల పరిధిలో క్రైస్ట చర్చి హైస్కూల్, ఆగస్టిన్ హైస్కూల్ యాజమాన్యం బోగస్ పత్రాలు సమర్పించి నామినల్ కోడ్ను పొందినట్లు జిల్లా విద్యాశాఖాధికారులు గుర్తించారు.
ఈ విషయంపై తక్షణమే దృష్టి సాధించిన ఆర్జేడీ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో 7 ప్రైయివేట్ పాఠశాలలు అక్రమ పద్ధతిలో అనుమతిని తీసుకున్నట్లు స్పష్టమైయిందని ఆర్జేడీ అధికారులు స్పష్టం చేశారు. బండ్లగూడ మండల పరిధిలోని పాఠశాలలని గుర్తించారు. ఈ పాఠశాలలకు ఆర్జేడీ షోకా జ్ నోటీసులు జారీ చేశారు. మరో మూడు రోజుల్లో పాఠశాలల యాజ మా న్యం వివరణ అనంతరం చర్యలు తీసుకుంటామని తెలి పారు.