జమ్మూకశ్మీర్ : బారాముల్లా జిల్లాలో భద్రతాబలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఇద్దరు ఉగ్రవాదులు పల్హాలన్ ప్రాంతంలోని పట్టన్లోకి చొరబడ్డారన్న సమాచారమందడంతో భద్రతాబలగాలు చుట్టుముట్టి కాల్పులను జరుపుతున్నాయి. ఇటీవలే కరణ్ నగర్ ఆర్మీ క్యాంపులోకి ప్రవేశించేందుకు ఉగ్రవాదులు యత్నిస్తుండగా..భద్రతా బలగాలు వారిపై కాల్పులు జరిపి ప్రతిఘటించిన విషయం తెలిసిందే.