హైదరాబాద్ : బంజారాహిల్స్ లోని కేబీఆర్ పార్కు వద్ద జలమండలి ఆధ్వర్యంలో ‘జలం- జీవం’ అవగాహన వాక్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జలమండలి ఎండీ దానకిషోర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, పలువురు అధికారులు, ఔత్సాహికులు పాల్గొన్నారు. జలం-జీవం కార్యక్రమంలో భాగంగా ఎక్కువ సంఖ్యలో ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టడం ద్వారా..అవి నిర్మించిన చోట జలమట్టం పెరుగుతుంది. ఈ కార్యమంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అధికారులు అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నారు.