హైదరాబాద్: జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ఏర్పాటుచేసిన సంయుక్త నిజ నిర్ధారణ కమిటీ(జేఎఫ్సీ) తొలి సమావేశం శుక్రవారం దసపల్లా హోటల్లో ప్రారంభమైంది. ఈ సమావేశానికి పవన్కల్యాణ్, లోక్సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ, మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణ్కుమార్, కొణతాల రామకృష్ణ, సీపీఎం నుంచి మధు, సీపీఐ నుంచి రామకృష్ణ, కాంగ్రెస్ నుంచి గిడుగు రుద్రరాజు, జంగా గౌతం, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు, ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ఖు ఇప్పటివరకు కేంద్రం అమలుచేసిన విభజన హామీలు, ఇంకా నెరవేర్చవలసిన హామీలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.