హైదరాబాద్ : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హెచ్ఎండీఏ సంచాలకుడు పురుషోత్తం రెడ్డి శుక్రవారం ఉదయం ఏసీబీ కోర్టులో లొంగిపోయారు. పురుషోత్తంరెడ్డికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కొంతకాలంగా పురుషోత్తంరెడ్డి పరారీలో ఉన్నారు. అతని నివాసంలో కోట్లాది రూపాయాల అక్రమాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆయన బంధువుల నివాసాల్లోనూ అధికారులు సోదాలు నిర్వహించారు. బంధువుల ఇళ్లల్లో భారీగా స్థిర, చరాస్తులను గుర్తించారు.