హైదరాబాద్: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు హైదరాబాద్లో పులి.. ఢిల్లీలో పిల్లి అని మాజీ మంత్రి, శాసనమండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ముస్లిం రిజర్వేషన్ పెంపు బిల్లు ఎక్కడ ఉండో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే పార్లమెంట్లో ఏపీ ఎంపీలు పోరాడుతుంటే టీఆర్ఎస్ ఎంపీలు ఎందుకు మౌనంగా ఉన్నారని షబ్బీర్ ప్రశ్నించారు. అలాగే కందులు, ఎర్రజొన్నలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయాలని, కర్ణాటక తరహాలో మద్దతు ధర చెల్లించాలని షబ్బీర్ అలీ అన్నారు.