హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రధాత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి జన్మదినం పురస్కరించుకొని పుస్తకాల పంపిణీ చేశారు. హైదరాబాద్ దోమలగూడలోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు మేడే రాజీవ్ సాగర్ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు వీజీఎస్ గైడ్స్ మరియు మోడల్ పేపర్స్ కి సంబందించిన పుస్తకాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా రాజీవ్ సాగర్ మాట్లాడుతూ విద్యార్థి దశలో ఉన్న వారికి పదవ తరగతి చాలా కీలకం. ఒక విద్యార్థి ఇంజనీర్ కావాలన్న, డాక్టర్ కావాలి అనుకున్న, చాటెడ్ అకౌంటెంట్ కావాలనుకున్న వారికీ పునాది. బంగారు తెలంగాణ నిర్మాణం విద్యార్థుల చేతుల్లోనే ఉంది.
ఎంపీ కల్వకుంట్ల కవిత తెలంగాణ రాష్ట్ర భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ చీఫ్ కమీషనర్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంస్థ అభివృద్ధికి అనేక విధాలుగా కృషి చేస్తున్నారని తెలియజేసారు. పేద కుటుంబం నుండి వచ్చి ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులకు కవిత గారి సహకారంతో మధ్యాహ్న భోజన పథకం ద్వారా భోజన సదుపాయం కల్పిస్తున్నారు. దీనికి ఎంపీ కవిత గారికి విద్యార్థుల తరుపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో తెలంగాణ జాగృతి ఉపాధ్యక్షురాలు వరలక్ష్మి, తెలంగాణ జాగృతి లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ తిరుపతి వర్మ, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అధికారులు, పాఠశాల ఉపాధ్యాయుల బృందం పాల్గొన్నారు.