వికారాబాద్: జిల్లా కేంద్రంలోని రాజీవ్నగర్ కాలనీలో పోలీసులు గడిచిన రాత్రి నిర్బంధ తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ అన్నపూర్ణ ఆదేశాల మేరకు డీఎస్పీ శిరీష ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిపిన సోదాల్లో సరైన పత్రాలు లేని 22 బైక్లను, కారు, ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.