హైదరాబాద్: నగర ట్రాఫిక్ పోలీసులు గడిచిన రాత్రి జూబ్లీహిల్స్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న 14 మందిపై కేసులు నమోదు చేశారు. 8 కార్లు, 6 బైక్లు సీజ్ చేశారు. పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండటంతో ఓ మహిళ కారు వదిలేసి వెళ్లిపోయింది. మరోవైపు మద్యం మత్తులో కొందరు యువకులు మీడియాపై దురుసుగా ప్రవర్తించారు. మీడియాపై దాడి చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.