రాజకీయ నాయకులు తమ ఆస్తులకు సంబంధించిన ప్రకటనల్లో భార్యాపిల్లల ఆదాయం లెక్కలు కూడా చెప్పాలని, ఆ ఆదాయం ఎలా వస్తున్నదనే విషయం కూడా చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో వారి భాగస్వామ్యం ఎంతో చెప్పాలని సుప్రీంకోర్టు పేర్కొంది. రాజకీయ నాయకులు, వారి కుటుంబ సభ్యుల ఆదాయం పెరిగిందంటే పదవుల దుర్వినియోగం జరిగిందని అర్థమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.