హైదరాబాద్: నగరంలోని బన్సిలాల్ డివిజన్ సీసీనగర్లో నిర్మించ తలపెట్టిన డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి ఎంపీ కవిత శంకుస్థాపన చేశారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్రెడ్డిలతో కలిసి ఆమె ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. పూజా కార్యక్రమంలో పాల్గొని అనంతరం స్థానికులను ఉద్దేశించి మాట్లాడారు.