కృష్ణా: కృష్ణా యూనివర్శిటీ పరిధిలోని 154 డిగ్రీ కాలేజ్లోని విద్యార్థులు ఎదుర్కొంటున్న మెగా సప్లిమెంటరి పరీక్షను నిర్వహించాలని ఎస్ఆర్ఆర్ కాలేజీ విద్యార్థులు డిమాండ్ చేశారు. విజయవాడ సిటీ వైస్ ప్రెసిడెంట్ బాబు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఇటీవల కాలేజీ స్థలం కబ్జాకు గురవ్వడంతో విద్యార్థులు ఆందోళన బాట పట్టామన్నారు. దీంతో విఎంసి ప్లానింగ్ కమిషన్ను రద్దు చేసిందన్నారు. కబ్జా స్థలాన్ని కాలేజీకి అప్పగిస్తామని పేపర్ స్టేట్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం ఈనెల 19న చలో ఎస్ఆర్ఆర్ కాలేజీకి పిలుపునివ్వడం జరిగిందన్నారు. ఈ నెల 20,21,22 3రోజులు పాటు నిరవధిక నిరాహార దీక్షలు నిర్వహించనున్నామని తెలిపారు.