ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేసీఆర్ మాల ధరించిన కార్యకర్తలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 17, 2018, 01:23 PM

టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కొందరు కేసీఆర్ మాలధారణ చేశారు. ఆరు రోజులు నిష్ఠగా ఉండి.. విరమణ చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా బాచుపల్లి మండలం శ్రీసాయినగర్ కి చెందిన 16 మంది కార్యకర్తలు ఈ కేసీఆర్ దీక్ష చేపట్టారు. ఫిబ్రవరి 12 నుంచి 17వ తేదీ ఈ మాలధారణ ఉంటుంది. 17వ తేదీ కేసీఆర్ బర్త్ డే సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెప్పి దీక్ష విరమిస్తారు. శ్రీసాయినగర్ నుంచి పాదయాత్రగ వీరు టీఆర్ఎస్ భవన్ చేసుకున్నారు.


కేసీఆర్ దీక్ష ఏంటీ :ఈ దీక్ష ప్రతి ఏటా ఫిబ్రవరి 12 నుంచి 17వ తేదీ వరకు ఆరు రోజులు చేపడతారు. గులాబీ రంగు దుస్తులు ధరిస్తారు. ఈ ఆరు రోజులు.. రోజుకో గుడికి వెళతారు. ఆలయాలతోపాటు చర్చి, మసీదుకు కూడా వెళతారు. కేసీఆర్ పేరుపై సర్వమత ప్రార్థనలు చేస్తారు. ఈ ఆరు రోజులు నిష్టగా ఉంటారు. కేసీఆర్ పథకాలను గ్రామగ్రామాన ప్రచారం చేయాలనే సంకల్పంతో ఈ దీక్ష చేపడుతున్నట్లు వెల్లడించారు టీఆర్ఎస్ కార్యకర్తలు.


కేసీఆర్ మాలధారణ ఎందుకు? పుట్టబోయే బిడ్డ నుంచి పండు ముసలి వరకు అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక వ్యక్తిగా కీర్తిస్తున్నారు ఈ మాలధారణ కార్యకర్తలు. ప్రతి ఇంటికి.. ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు తీసుకెళుతున్న ఘనత కేసీఆర్ దే అంటున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com