న్యూఢిల్లీ : తొమ్మిది నెలల క్రితం కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన అర్వీందర్ సింగ్ మళ్లీ స్వంత గూటికి చేరారు. ఇవాళ మళ్లీ ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో కీలక నేతగా అర్వీందర్ సింగ్ చాన్నాళ్లూ కొనసాగారు. సిద్ధాంతపరంగా తనకు బీజేపీతో సఖ్యత కుదరలేదని ఈ సందర్భంగా అర్వీందర్ తెలిపారు. మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. ఏఐసీసీ ఇన్చార్జ్ అజయ్ మాకెన్ ఆయనకు స్వాగతం పలికారు. ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్కు అర్వీందర్ చాలా సన్నిహితుడు. ఆమె ప్రభుత్వంలో అర్వీందర్ కీలకమైన పదువుల్లో కొనసాగారు. ఇప్పటివరకు నాలుగుసార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు.