యాదాద్రి భువనగిరి: యాదగిరిగుట్టకు భక్తులు పోటెత్తారు. సెలవుదినం కావడంతో యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహస్వామిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో యాదాద్రికి చేరుకున్నారు. దీంతో యాదాద్రి పరిసరాలు జనంతో కిక్కిరిసిపోయాయి. స్వామి వారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. స్వామి వారి ధర్మదర్శనానికి 3 గంటల సమయం పడుతున్నది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంటన్నర సమయం పడుతున్నది. రద్దీ కారణంగా కొండపైకి వాహనాలను పోలీసులు అనుమతించట్లేదు.