వికారాబాద్: తాండూరు నుంచి బెంగళూరుకు ఏసీ బస్సు ప్రారంభమయింది. ఏసీ బస్సును రాష్ట్ర రవాణా శాఖ మత్రి మహేందర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం యాలాల మండలం ఆడల్పూర్ గ్రామానికి పల్లెవెలుగు బస్సును మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ... ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సంస్థ అభివృద్ధి వైపు దూసుకుపోతున్నదన్నారు. రోడ్డు ఉన్న ప్రతి గామానికి పల్లెవెలుగు సర్వీసు ప్రారంభిస్తామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.