అగర్తల : త్రిపురలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచే ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులుతీరారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ 11గంటల వరకు 13 శాతం నమోదైంది. త్రిపురలో మొత్తం 60 నియోజకవర్గాలు ఉండగా 59 నియోజకవర్గాలకు నేడు పోలింగ్ జరుగుతోంది. అధికార పార్టీ సీపీఎం, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. మార్చి 3న త్రిపుర అసెంబ్లి ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. పోలింగ్ దృష్ట్యా 300 కంపెనీల కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు.