సిద్దిపేట: సిద్దిపేటను వ్యాపారపరంగా మరింత అభివృద్ధి చేస్తామని రాష్ట్ర మంత్రి హరీశ్రావు తెలిపారు. సిద్దిపేటలో మంత్రి నేడు మాంగళ్య షాపింగ్మాల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సిద్దిపేట అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు. సిద్దిపేట ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళ్లి బట్టలు తెచ్చుకునేవారని.. ఈ షాపింగ్మాల్ ద్వారా నాణ్యమైన బట్టలు తక్కువ ధరకే అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.