ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెండు రోజుల్లో ఆర్డీఎస్ ఆయకట్టుకు నీరు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 18, 2018, 01:56 PM

జోగులాంబ గద్వాల : రాజోలి బండ డైవర్షన్ స్కీం(ఆర్డీఎస్) కింద ఉన్న ఆయకట్టుకు రెండు రోజుల్లో సాగునీరు అందనుంది. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 11న తుంగభద్ర డ్యామ్ నుంచి కర్ణాటక నీటిని విడుదల చేసింది. సుమారు 80 కిలోమీటర్లు ప్రవహించిన నీరు.. నేడు ఆర్డీఎస్‌కు చేరుకుంది. రెండు రోజుల్లో ఆర్డీఎస్ ఆయకట్టుకు నీరు అందనుంది. 14 రోజుల పాటు రోజుకు 1000 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేయనున్నారు. నీటి విడుదలతో ఆర్డీఎస్ ఆయకట్టు కింద ఉన్న 6 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com