ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్టేషన్ ఘన్‌పూర్‌లో డిగ్రీ కళాశాల ఏర్పాటు: కడియం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 18, 2018, 03:13 PM

జనగాం: జిల్లాలోని స్టేషన్ ఘన్‌పూర్ మండలంలో వచ్చే విద్యాసంవత్సరానికి డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేస్తమని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. జనగాం జిల్లా రఘనాథపల్లి మండలం ఇబ్రహీంపూర్‌లో ఏర్పాటు చేసిన డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహాన్ని నేడు కడియం శ్రీహరి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో 470 గురుకుల పాఠశాలలను ప్రారంభించినట్లు తెలిపారు. ఇది దేశ చరిత్రలోనే ఒక రికార్డు అన్నారు. చరిత్రలో లేని విధంగా తెలంగాణలో 53 రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలను మంజూరు చేసినట్లు తెలిపారు. కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్‌లాంటి పథకాలతో మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసినట్లు చెప్పారు. మంత్రి హరీశ్‌రావుతో మాట్లాడి రఘునాథపల్లి మండలంలో చెరువులను నింపుతామని కడియం శ్రీహరి పేర్కొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com