హైదరాబాద్: కేంద్రమంత్రి అనంత్కుమార్ హెగ్డేను రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కలిశారు. నగరంలోని నోవాటెల్ వీరి భేటీ జరిగింది. సమావేశం సందర్భంగా కార్మికశాఖ బలోపేతానికి తీసుకున్న చర్యలను నాయిని కేంద్రమంత్రికి వివరించారు. దీనిపై అనంత్కుమార్ స్పందిస్తూ.. రాష్ట్ర పారిశ్రామిక శిక్షణ సంస్థ సమర్థంగా పనిచేస్తోందని తెలిపారు. పారిశ్రామిక శిక్షణ కేంద్రానికి సహాయం చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.