హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్లో వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించారు. మండల రైతు సమన్వయ సమితి సదస్సులు నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. ఈ నెల 25న హైదరాబాద్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో తొలి సదస్సు, 26న కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో రెండో సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు. రైతు సమన్వయ సదస్సులకు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. ప్రభుత్వం త్వరలోనే రాష్ట్రస్థాయి రైతు సమన్వయ సమితిని ఖరారు చేయనుంది. ప్రభుత్వం 42 మంది సభ్యులతో రాష్ట్ర రైతు సమన్వయ సమితి ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సమితిలో 30 జిల్లాలకు చెందిన ప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులకు ప్రాతినిధ్యం కల్పించనుంది. రాష్ట్రస్థాయి సమితిలో వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ నిపుణులకు చోటు కల్పించనుంది.