ఛత్తీస్గఢ్లోని సుకుమాలో మావోయిస్టులు విధ్వంసం సృష్టించారు. అటవీ ప్రాంతంలో రోడ్డు పనులు చేయిస్తున్న సూపర్వైజర్ను అతికిరాతకంగా చంపేశారు. అనంతరం జేసీబీ, ట్రాక్టర్లు సహా 12 వాహనాలను తగులబెట్టారు. అనంతరం పోలీసు బృందంతో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక పౌరుడు మరణించారు. సుకుమా జిల్లాలో బెజ్జి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం (ఫిబ్రవరి 18) మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. బుల్లెట్ దెబ్బలుతిన్న మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది.సుకుమా జిల్లా చింతకుప్ప ప్రాంతంలో రహదారి నిర్మించవద్దంటూ నక్సలైట్లు గతంలో పలుమార్లు హెచ్చరికలు జారీచేశారు. ఆ హెచ్చరికలను ఖాతరు చేయకుండా కాంట్రాక్టర్ పనులు ప్రారంభించడంతో ఆగ్రహానికి గురయ్యారు. ఆదివారం పనులు జరుగుతున్న ప్రాంతానికి వచ్చిన మావోయిస్టు బృందం.. కాంట్రాక్టర్ సూపర్వైజర్ను చితకబాది చంపేశారు.
అంతలోనే మావోయిస్టుల కోసం గాలిస్తున్న స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందం ఎదుదైంది. దీంతో ఇరువైపుల నుంచి కాల్పులు మొదలయ్యాయి. కొన్ని గంటల పాటు కొనసాగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు కానిస్టేబుళ్లతో పాటు మరో సాధారణ పౌరుడు మరణించారు. గాయపడ్డ కానిస్టేబుళ్లలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.