నల్లగొండ: జిల్లాలోని చిట్యాల మండలం గుండ్రంపల్లి శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరు నుంచి హైదరాబాద్కు వెళుతున్న గుర్తు తెలియని వాహనాన్ని వెనక నుంచి ఇన్నోవా కారు ఢీకొంది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న అజమోద్దీన్(55) అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితులు గుంటూరుకు చెందిన వారిగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.