హైదరాబాద్: స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే హైదరాబాద్లో ప్రారంభమైంది. స్వచ్చ కార్యక్రమాలపై మూడు బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ముందుగా స్వచ్చ నివేదికల పరిశీలన జరగనుంది. నెంబర్ వన్ ర్యాంకింగ్ కోసం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పలు క్యాక్రమాలు నిర్వహించింది. గత సంవత్సరం మెట్రో నగరాల్లో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. ఈసారి 4041 నగరాలు పోటీపడుతున్నాయి. స్వచ్ఛ భారత్ మిషన్ ప్రతినిధి బృందం అడిగే 6 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని నగర ప్రజలకు జీహెచ్ఎంసీ విజ్ఞప్తి చేసింది.