న్యూఢిల్లీ : ద్వైపాక్షిక చర్చలకోసం విదేశీ వ్యవహారాల కార్యదర్శి విజరు గోఖలే, ఆర్మీ చీఫ్ బిపిన్రావత్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవెల్ ఈ నెల మరోసారి భూటాన్ను సందర్శించనున్నట్లు అధికారిక వర్గాల ప్రదినిధి తెలిపారు. ఈనెల 6,7 తేదీలలో గువహటిలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో భూటాన్ ప్రతినిధి టిరింగ్ టబాగేతో ద్వైపాక్షిక సంబంధాల గురించి ప్రధాని మోడీ చర్చలు జరిపారని, వాటిలో డోక్లామ్ ప్రాంతం గురించి కూడా చర్చించినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశాల్లో ఆశించిన స్థాయిలో మంచి ఫలితాల్ని ఇచ్చాయని తెలిపారు. దీంతో ఆర్మీ చీఫ్ రావత్ మరోసారి ద్వైపాక్షిక చర్చల కోసం భూటాన్ వెళ్లనున్నట్లు ప్రకటించారు. గతేడాది ఏప్రిల్లో రావత్, అక్టోబర్లో విదేశీ వ్యవహారాల కార్యదర్శులు భూటాన్ను సందర్శించిన విషయం తెలిసిందే.