హైదరాబాద్ : తెలంగాణ రాజధాని హైదరాబాద్లోని హైటెక్స్ వేదికగా ప్రపంచ ఐటీ కాంగ్రెస్ కార్యక్రమం మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ సదస్సు నేటి నుంచి మూడు రోజుల పాటు కొనసాగనుంది. నాస్కామ్, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సదస్సులో సీఎం కేసీఆర్, కేంద్రమంత్రి రవిశంకర్ప్రసాద్, ఐటీ మినిస్టర్ కేటీఆర్, వివిధ దేశాల ఐటీ మంత్రులు, ఐటీ దిగ్గజాలు, 89 దేశాలకు చెందిన 2500 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. సదస్సును ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో కేంద్రమంత్రి రవి శంకర్ప్రసాద్ పాల్గొననున్నారు. ఫైబర్ గ్రిడ్ ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం.. ప్రపంచానికి పరిచయం చేయనుంది. హైటెక్స్ నుంచి పైలట్ ప్రాజెక్టును కేటీఆర్ వివరించనున్నారు.