ముంబయి: పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణానికి సంబంధించిన ఆందోళనలు దేశీయ మార్కెట్లను ఇంకా వదట్లేదు. సోమవారం కూడా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ షేర్లు నష్టాల్లో ఉండటంతో ఆ ప్రభావం మార్కెట్లపై పడింది. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లు కూడా బలహీనంగా ఉండటం మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీసింది. దీంతో ఈ వారాన్ని స్టాక్మార్కెట్లు నష్టాలతో ప్రారంభించాయి. సెన్సెక్స్ దాదాపు 200 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతుండగా.. నిఫ్టీ కూడా 10,400 దిగువకు పడిపోయింది. ఉదయం 10 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 180 పాయింట్లు కోల్పోయి 33,830 వద్ద, నిఫ్టీ 58 పాయింట్ల నష్టంతో 10,394 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఎస్బీఐ, యస్బ్యాంక్, తదితర బ్యాంకింగ్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.