ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మేఘాలయలో ఎన్సీపీ లీడర్ హత్య

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 19, 2018, 11:10 AM

షిల్లాంగ్ : మేఘాలయలోని ఈస్ట్ గారో హిల్స్‌లో ఆదివారం రాత్రి దారుణం జరిగింది. నేషనల్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) నేత జోనథోన్ ఎన్ సంగ్మా లక్ష్యంగా గుర్తు తెలియని వ్యక్తులు ల్యాండ్‌మైన్ పేల్చారు. ఈ పేలుడు ఘటనలో ఎన్ సంగ్మాతో పాటు ఇద్దరు కార్యకర్తలు, భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నెల 27న మేఘాలయ శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఎన్నికల ప్రచారం ముగించుకుని సంగ్మా.. తన ఇంటికి తిరిగి వస్తుండగా ఈ దారుణం జరిగింది. ఉగ్రవాదులే ల్యాండ్‌మైన్ పేల్చి ఉంటారని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఎన్ సంగ్మా మృతిపట్ల మేఘాలయ సీఎం ముకుల్ సంగ్మా సంతాపం తెలిపారు. సంగ్మా తనకు అత్యంత సన్నిహితుడు, ఆయన మృతి పార్టీకి తీరని లోటు అని సీఎం పేర్కొన్నారు. 2013 ఎన్నికల సమయంలో కూడా సంగ్మాకు బెదిరింపులు వచ్చాయి. ఈ క్రమంలో అతనికి భద్రత పెంచారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com