తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు ప్రజా చైతన్య యాత్ర పేరిట బస్సు యాత్ర చేపట్టనున్నారు. దీనికి సంబంధించి తొలిదశ వివరాలను టి-కాంగ్రెస్ విడుదల చేసింది. ఈ నెల 26న చేవెళ్ల, వికారాబాద్లలో ప్రజా చైతన్యయాత్ర జరుగుతుంది. 27న తాండూరు, సంగారెడ్డి, 28 జహీరాబాద్, నారాయణ్ ఖేడ్, మార్చి 4న బోధన్, నిజామాబాద్, 5న ఆర్మూర్, బాల్కొండ, 6న నిర్మల్, బోథ్, 7న ఖానాపూర్, మెట్పల్లి, 8న జగిత్యాల, సిరిసిల్ల, 9న కరీనంగర్. మానకొండూరు, 10 హస్నాబాద్, హుజూరాబాద్, 11న పెద్దపల్లి, రామగుండం, 12న మంథని, భూపాలపల్లిలలో కాంగ్రెస్ ప్రజా చైతన్య యాత్ర జరుగుతుంది.