ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మన చుట్టూ ఉన్న అతి ముఖ్యమైన వనరు నీరు: సద్గురు జగ్గీవాసుదేవ్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 19, 2018, 11:33 AM

హైదరాబాద్‌లో ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌ సదస్సు ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా హాజరైన ఈషా ఫౌండేషన్‌ సద్గురు జగ్గీవాసుదేవ్‌ హైటెక్స్‌లో ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌ సదస్సు ప్రారంభ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశంలోనే తొలిసారిగా హైటెక్స్‌ వేదికగా ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌ సదస్సును మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు. సదస్సుకు 30 దేశాలకు చెందిన 2వేల మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. మన చుట్టూ ఉన్న అతి ముఖ్యమైన వనరు నీరు అని అన్నారు. నీరుకు అర్థం మనలో ఎవరికీ తెలియదన్నారు. నీటిని పొదుపుగా వాడుకోవాలని, కలుషితం చేయకూడదని సూచించారు. మీరు ఏదైనా చేయాలంటే ఏకాగ్రత అవసరమని సద్గురు అన్నారు. ఏకాగ్రతతో పని చేస్తే అవకాశాలు తలుపు తడతాయన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com