ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌ సదస్సును వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించిన ప్రధాని మోడీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 19, 2018, 11:46 AM

హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగరంలోని హైటెక్స్‌లో జరుగుతున్న ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌ సదస్సును ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఢిల్లి నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మోడీ సదస్సును ప్రారంభించారు. అనంతరం ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌ సదస్సునుద్దేశించి ప్రసంగిస్తున్నారు. సదస్సుకు దేశ, విదేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. డిజిటల్‌ సాంకేతికత ఆవిర్భావానికి భారత్‌ ప్రధాన కేంద్రమని మోడీ అన్నారు. ప్రపంచ ఐటీ సదస్సును ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. భారత్‌లో ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌ జరగడం ఇదే ప్రథమమన్నారు. సదస్సుకు వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులకు భారత్‌, హైదరాబాద్‌ ఆహ్వానం పలుకుతోందన్నారు.  ఐటి రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని అన్నారు. దేశంలో లక్ష గ్రామాలను ఆప్టిక్‌ ఫైబర్‌తో అనుసంధానించామని అన్నారు. భారత్‌ డిజిటల్‌ ఇండియా దిశగా పయనిస్తోందని ఆయన అన్నారు. అయితే ఇది ప్రభుత్వంతో మాత్రమే అయ్యే పని కాదని ఆయన స్పష్టం చేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com