హైదరాబాద్ : సాంకేతికతతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని కేంద్రమంత్రి రవిశంకర్ప్రసాద్ స్పష్టం చేశారు. హైటెక్స్లో జరుగుతున్న ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సులో రవిశంకర్ప్రసాద్ మాట్లాడారు. భారత ప్రభుత్వం డిజిటల్ ఇండియా, మేకిన్ ఇండియా, స్కిల్ ఇండియాకు ప్రాధాన్యం ఇస్తుందని ఉద్ఘాటించారు. 1.25 బిలియన్ భారత ప్రజలు అత్యాధునిక డిజిటల్ గుర్తింపు కార్డును కలిగి ఉన్నారని తెలిపారు. 60 లక్షల మంది పౌరులను డిజిటల్ అక్షరాస్యులను చేయడమే లక్ష్యమన్నారు. కంప్యూటర్ వస్తే ఉద్యోగాలు పోతాయని భయపడ్డారు.. కానీ అలా జరగలేదని కేంద్రమంత్రి పేర్కొన్నారు. నూతన సాంకేతికత వల్ల సవాళ్లతో పాటు, ఉపయోగాలు ఉన్నాయని తెలిపారు. రోబోల ప్రవేశం నూతన సాంకేతికతలో గొప్ప మార్పు అని చెప్పారు. భారతీయులు ఎప్పటికీ టెక్నాలజీని ఆహ్వానిస్తున్నారని వెల్లడించారు. ఆధార్ నంబర్ను తీసుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చారని కేంద్రమంత్రి గుర్తు చేశారు.