ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మైసమ్మ ఆలయంలో మంత్రి లక్ష్మారెడ్డిప్రత్యేక పూజలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 19, 2018, 11:51 AM

మహబూబ్‌నగర్ జిల్లాలోని నవాబుపేట మండలంలో మంత్రి లక్ష్మారెడ్డి పర్యటిస్తున్నారు. గ్రామంలోని మైసమ్మ దేవాలయం వార్షికోత్సవంలో భాగంగా మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదాద్రి నరసింహస్వామి ఆలయంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆలయాలన్నీ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మైసమ్మ ఆలయ అభివృద్ధికి కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. రూ.6 కోట్ల కేటాయింపుతో మండలంలోని బీటీ రోడ్లను విస్తరిస్తామన్నారు. ఆలయ విస్తరణకు త్వరలోనే అటవీశాఖ అనుమతులు తీసుకుంటామన్నారు. త్వరలోనే భక్తులకు మిషన్ భగీరథ తాగునీరు అందిస్తామని పేర్కొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com