మహబూబ్నగర్ జిల్లాలోని నవాబుపేట మండలంలో మంత్రి లక్ష్మారెడ్డి పర్యటిస్తున్నారు. గ్రామంలోని మైసమ్మ దేవాలయం వార్షికోత్సవంలో భాగంగా మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదాద్రి నరసింహస్వామి ఆలయంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆలయాలన్నీ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మైసమ్మ ఆలయ అభివృద్ధికి కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. రూ.6 కోట్ల కేటాయింపుతో మండలంలోని బీటీ రోడ్లను విస్తరిస్తామన్నారు. ఆలయ విస్తరణకు త్వరలోనే అటవీశాఖ అనుమతులు తీసుకుంటామన్నారు. త్వరలోనే భక్తులకు మిషన్ భగీరథ తాగునీరు అందిస్తామని పేర్కొన్నారు.